logo

ఇంటర్ ఫెయిల్ అయిన వారికి స్పెషల్ క్లాసులు


ఉమ్మడి విజయనగరం జిల్లాలోని అంబేడ్కర్
గురుకులాల్లో ఇంటర్ తప్పిన విద్యార్థులకు స్పెషల్
క్లాసులు నిర్వహిస్తున్నట్లు సమన్వయకర్త టి. పద్మజ
తెలిపారు. 13 గురుకులాల్లోని ఫస్ట్ ఇయర్, సెకెండియర్
కలిపి 172 మంది ఫెయిలయ్యారని వెల్లడించారు.
ఈనెల 24న తరగతులు ప్రారంభించగా.. మే 23
వరకు కొనసాగుతాయన్నారు. బాలురుకు కొప్పెర్లలో,
బాలికలకు నెల్లిమర్ల గురుకులంలో వేర్వేరుగా తరగతులు
నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

0
0 views